శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గురువారం బాలల దినోత్సవ వేడుకలను శ్రీ విద్య విద్యా సంస్థల అధినేత దాడిశెట్టి విష్ణుచక్రం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరమని. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులని, అందుకు సూచకంగా బాలల దినోత్సవం జరుపుకుంటారని, భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం అయిన నవంబరు 14న ఈ ఉత్సవం జరుగుతుందని, నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారని, పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారని అన్నారు. విద్యా సంస్థ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత మన చాచాజీ సొంతమని అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోందని, అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉందన్నారు. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూదని అన్నారు. ప్రిన్సిపల్ మాణిక్యాలరావు మాట్లాడుతూ పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య మేనేజింగ్ డైరెక్టర్ ఆచంట నరసయ్య, ఏవో సూర్యనారాయణ, అడ్వయిజర్ సత్యనారాయణ,ఉపాద్యాయులు పాల్గొన్నారు.