రాజస్తాన్లోని సికర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఓ టెంపో వాహనం ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖటుశ్యామ్-రింగాస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్నవారంతా ఖటుశ్యామ్ ఆలయ సందర్శన కోసం వెళ్తున్నట్టు సమాచారం. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.