బ్లూఫ్రాగ్ కంపెనీతో తనకు సంబంధం ఉందని వైసిపి నేతలు పదే పదే దొంగచాటు ప్రచారం చేస్తున్నారని, వారికి దమ్ముంటే ఆధారాలతో నిరూపించండని వైసీపీకి టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ సవాల్ విసిరారు. చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు..జగన్ ప్రభుత్వం చీప్ ట్రిక్స్ చేస్తోందని, అసమర్థ పాలనపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక.. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తన పైనా తెలుగుదేశం పార్టీపైనా అనేక ఆరోపణలు చేశారని, నిరూపించమంటే పారిపోయి, ఇప్పుడు మళ్లీ అదే గళం వినిపిస్తున్నారని ఎద్దేవాచేశారు. . బ్లూ ఫ్రాగ్ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ఆ కంపెనీతో సంబంధం ఉన్నట్లు.. అసత్య వార్తలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అన్నివిధాలా చర్యలు చేపట్టనున్నామని నారా లోకేష్ చెప్పారు.