తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత పార్థసారథి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలకు సాయంత్రంలోగా ఆధారాలు చూపాలని, లేదంటే చంద్రబాబు చేసే దీక్ష పక్కనే తాను కూడా దీక్ష చేస్తానని పార్థసారథి పేర్కొన్నారు. ఆధారాలు చూపకపోతే బాబుపై పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. ఇసుక కొరతకు చంద్రబాబే కారణమన్నారు. ఇసుకపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరమన్నారు. పవన్తో కలిసి చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు. ఇసుకను అన్నంలా తిన్న చరిత్ర చంద్రబాబుదన్నారు.