కడప జిల్లా : రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నందు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు.క్యాంపస్ లో ఉన్న దాదాపు 6000 మంది విద్యార్థులకు NSS ఆధ్వర్యంలో.బోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంక్ కడప వారిచ్చే ఉచిత మెగా మెడికల్ క్యాంపు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు డాక్టర్లు పలు సూచనలు చేశారు.వైరల్ ఫివర్, అంటువ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించారు.డాక్టర్లు విద్యార్థులకు ఉచిత మెడికల్ చెకప్ చేసి, మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సుదర్శన్ రావు తో పాటు ట్రిపుల్ ఐటీ సిబ్బంది పాల్గొన్నారు