సెల్ఫీ పిచ్చి మరో యువతి ప్రాణం తీసింది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. నర్సరావుపేటకు చెందిన ధనలక్ష్మి తన స్నేహితురాలుతో కలసి శుభకార్యానికి నకరికల్లు మండలం కండ్లగుంట వెళ్లింది. మార్గంమధ్యలో కడ్లకుంట బ్రాంచి కెనాల్ వద్ద సెల్ఫీ దిగాలనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయారు. స్ధానికులు గమనించి వెంటనే ఒకరిని రక్షించారు. మరో విద్యార్ధి ధనలక్ష్మి మాత్రం కెనాల్ పడి మృతిచెందింది.