కర్నాటకలో యడియూరప్ప తరహా రాజకీయాలు చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని, తమ దగ్గర చెల్లవంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. భాజపాతో చర్చలంటూ జరిపితే అది కేవలం ముఖ్యమంత్రి పదవిపైనేనన్నారు. అంతకుముందు శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ‘అహంకారం అనే బురదలో రథం ఇరుక్కుపోయింది’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో సంజయ్ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. తమకు ఇప్పటికే 170మంది ఎమ్మెల్యేల మద్దతుందని.. ఆ సంఖ్య 175కి కూడా చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. శివసేనతో కలిసి పోటీ చేసినందు వల్లే భాజపా 105 స్థానాల్లో విజయం సాధించిందని.. లేనిపక్షంలో ఆ పార్టీ 75సీట్లకే పరిమితమయ్యేదని స్పష్టం చేశారు.