ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని బీజేపీ నేత మాణిక్యాల రావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.