కమలాపురం సి. ఐ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమలాపురం పరిధిలోని క్రిటికల్ గ్రామాలైన సంబటూరు, కోగటంలో ఏపీఎస్పీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు.