మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని దొడ్డి, డి. బెలగల్, చింతకుంట, పల్లెపాడు గ్రామాల్లో గురువారం టీడీపీ కోసిగి ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ చైతన్య రథంపై రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ప్రతి గ్రామంలో సాగు, తాగునీరు అందిస్తామన్నారు.