రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి శ్రీకాకుళం శాసన సభకు పోటీ చేస్తున్న నన్నూ,శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను గెలిపించి,అత్యధిక మెజార్టీ అందించి ఆశీర్వదించాలని మంత్రి ధర్మాన కోరారు. మండలంలోని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిలగాం సింగువలసలో ఆయన మాట్లాడుతూ.. "ప్రభుత్వాలనేవి ప్రజల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడ్డాయా లేదా అన్నది చూడాలి. ఇతరత్రా చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని మన జీవితాలను బాగు చేస్తున్న ప్రభుత్వాలను వదులుకోకూడదు. మార్చడం వలన ఏ కుటుంబం అవసరాలూ తీరవు. ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల వలన మన అవసరాలు తీరుతాయి. అభివృద్ధి లేదని కొన్ని విపక్ష శ్రేణులు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. మీ కళ్లెదుట ఉన్న స్కూలు ఎవరి వల్ల అభివృద్ధి చెందింది ? మీ ప్రాంతపు వ్యవసాయానికి నీరు ఎవరి వల్ల వచ్చింది ? మీ ఊళ్లో ఉన్న రైతు భరోసా కేంద్రం కానీ సెక్రటేరియెట్ కానీ ఎవరి వల్ల వచ్చింది. మీ కుటుంబ అవసరాలకు సరిపడిన డబ్బులు ఎవరి వల్ల వచ్చాయి.? మీ ఆరోగ్యాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది ? మీకు అందించిన సరకులలో నాణ్యత ఎలా ఉంది ? ప్రభుత్వం అమలు చేస్తున్న అవినీతి ఏ మాత్రం ఉందా ? అని ప్రశ్నించారు.