ఇసుక మాఫియాను ప్రోత్సహించి కోట్లాది రూపాయలను తీసుకున్న వ్యక్తి లోకేశేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఇసుక రాజకీయాలపై లోకేశ్ మాట్లాడటం అంటే.. అంత దౌర్భాగ్యం మరోటి ఉండదన్నారు. చంద్రబాబు ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఏం మాట్లాడాలో తెలియక ఇసుక అంశాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతున్నారని మండిపడ్డారు.