మహిళళపై జరుగుతున్న నేరాల్లో రాష్ట్రం 2017లో అగ్రస్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని, నేరాలు అదుపులోకి వచ్చాయని తెలిపారు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందని, కేవలం రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తమ ప్రభుత్వంపై అపనిందలు వేస్తున్నారని అన్నారామె.