అమరావతి: ఏసీబీ అధికారులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్ ఫైర్ అయ్యారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. కొందరు అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారన్నారు. అధికారుల పనితీరు చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.