సమస్యలు పరిష్కారం కోరుతూ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమ్మె మొదలుపెట్టి మూడు రోజులు కావస్తున్న సందర్భంగా సీనియర్ నాయకులు మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఆకుల రామకృష్ణ ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ రామచంద్ర బుధవారం కార్మికుల శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలియజేశారు. పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైన వారి డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించాలని, గ్రామాల పరిశుభ్రత పాటుపడేది ఒక్క గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రమేనని అటువంటి కార్మికుల న్యాయబద్ధమైన కోరికలను ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సత్యనారాయణ, మండల కార్మికుల సంఘం అధ్యక్షుడు వెల్ల నాగేశ్వరరావు, సూర్య వెంకటరత్నం, గంగరాజు, వీరబాబు, రంజాన్, ఉమాశంకర్, త్రిమూర్తులు, ప్రకాష్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.