విశాఖలో అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా పట్టుబడింది. విశాఖలో లలితాకాలనీలోని ఓ ఇంట్లో దాడులు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు డ్రగ్ ముఠాను పట్టుకున్నారు. ముఠాలో మహిళా సహా నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు విజయవాడ, హైదరాబాద్, విశాఖలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి చేస్తున్నట్లు వెల్లడైంది.