తమిళనాడులోని మధురైలో ఓ మహిళ పోలీసులకే లైంగిక ఎరవేసి కటకటాలపాలయ్యింది. మధురైలో తిరుపతి అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతని సెల్ ఫోన్ కు ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. మహిళలతో జల్సాగా గడపాలనుకుంటే ఈ నంబర్ కు సంప్రదించాలని అందులో ఉంది. దీని వెనుక వ్యభిచార ముఠా ఉండవచ్చని గమనించిన తిరుపతి తన తోటి సిబ్బందికి చెప్పాడు. ఇంతలో మరో కానిస్టేబుల్ తనకు కూడా గతంలో ఇలా మెసేజ్ వచ్చిందని చెప్పాడు. దీంతో వారి అనుమానానికి బలం చేకూరింది. భారీ స్థాయిలో వ్యభిచార ముఠా నడుస్తుందని గమనించి వారిని పట్టుకోవాలని ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం కానిస్టేబుల్ తిరుపతి తనకు మహిళ నుంచి మెసేజ్ వచ్చిన నంబర్ కు సంప్రదించి వారు రమ్మన్న స్థలానికి వెళ్లాడు. అక్కడ ముందుగా తిరుపతితో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. బేరసారాలు మాట్లాడాడు. ఇంతలో అక్కడ ఉన్న ముఠా తిరుపతి వద్ద ఉన్న నగదును లాక్కుంది. అనంతరం ఎవరికి చెప్పవద్దని బెదిరించి ఓ మహిళను ఇచ్చి తిరుపతిని రూంలోకి పంపారు. మహిళతో కలిసి రూంలోకి వెళ్లిన తిరుపతి లెట్రిన్ కు వెళ్లి వస్తానని చెప్పి బయటికి వెళ్లాడు. అక్కడ నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న పోలీసులు వ్యభిచార గృహం పై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారాన్ని నడుపుతున్న అయ్యనార్,శేఖర్,మనోజ్ కుమార్ లతోపాటు నందిని అనే మహిళను అరెస్ట్ చేశారు. పోలీసుల దాడితో ఖంగుతిన్న వ్యభిచార నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేసినా పోలీసులు పక్కా ప్లాన్ తో దాడి చేయడంతో వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వీరి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ ముఠాలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.