ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2019, 06:59 PM

    కర్ణాటక సీఎం గా బీజేపీ నేత ఎదియూరప్ప ప్రమాణం చేసిన మూడు వారాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20 న బెంగుళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం నిర్ణయించింది. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా ఆమోదం కూడా లభించింది. కేబినెట్ విస్తరణకు అనుమతించాలని ఎదియూరప్ప ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కోరగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ విస్తరణ పరిమితంగానే ఉంటుందని, కొంతమంది అసంతృప్త వాదులకు కేబినెట్లో స్థానం లభించవచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గ ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని కాంగ్రెస్-జేడీ-ఎస్ తప్పు పట్టిన నేపథ్యంలో.. ఇక ఎడ్డీ నడుం బిగించక తప్పలేదు. ఆ మధ్య సుప్రీంకోర్టు కెక్కిన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనుకూలంగా కోర్టు తీర్పు వఛ్చిన పక్షంలో వారిలో కొందరిని మంత్రి పదవులు వరించవచ్చునని సమాచారం. . కాగా-బీజేపీ ఎల్ఫీ సమావేశం కూడా మంగళవారం ఉదయం విధాన సౌధలో జరుగుతుందని, ఆ మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.  


      









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com