ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 10:52 AM

ఢిల్లీ మెట్రో రైలు కిందపడి జహంగీర్‌పూరికి చెందిన ఓ వివాహిత(25) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఇవాళ ఉదయం 7:25 గంటలకు చోటు చేసుకుంది. ఆదర్శనగర్ మెట్రో స్టేషన్ వద్ద రైలు వస్తుండగా.. దాని కిందపడి అనిత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అనితకు ధర్మేందర్‌తో 2015లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ఒకరి వయసు మూడున్నరేండ్లు కాగా, మరొకరి వయసు ఎనిమిది నెలలు. అనిత మృతదేహాన్ని బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com