ఎన్నికల హామీల మేరకు దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నూతన మద్యం పాలసీ లో మొత్తంగా 4,380 మద్యం దుకాణాలు ఉండగా.. 800 షాపులు తగ్గిస్తూ మిగిలిన వాటిలో వీటిలో 15 వేల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిన నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అక్టోబర్ 1 నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10. వరకు పని చేసిన మద్యం దుకాణాలు ఇక నుండి రాత్రి తొమ్మది గంటల వరకే పని చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) నిర్వహించే వీటికి ఏపీఎస్బీసీఎల్ రిటైల్ ఔట్లెట్గా పిలుస్తారు.. ఇక ఇందులో పని చేసే షాపు సేల్స్మెన్ ఖచ్చితంగా స్థానికులై ఉండాలని నిర్దేశించింది. సూపర్వైజర్కు నెలకు రూ.17,500 జీతం, సేల్స్మెన్కు నెలకు రూ.15 వేల జీతంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తారు.