కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మల్లెల అనంత పద్మనాభరావుకు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. పద్మనాభ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లెల అనంత పద్మనాభ రావు మృతికి చంద్రబాబు సంతాపం తెలిపారు. పద్మనాభవరావు ఇబ్రహీంపట్నం సర్పంచిగా, చెరకు రైతుల సంఘం అధ్యక్షునిగా సేవలు అందించారు. పలు పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇచ్చారు. రాజధాని నగరం అభివృద్ధికి భూరి విరాళం ఇచ్చారు. పద్మనాభరావు కుటుంబ సభ్యులకు చంద్రబాబుతో పాటు పలువురు నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.