న్యూఢిల్లి : కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్తో తాను గత రాత్రి 8 గంటల 45 నిముషాలకు మాట్లాడానని సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే చెప్పారు. పాక్ జైలులో మగ్గుతున్న కుల్భూషణ్ జాదవ్ కేసును ఐసిజెలో వాదించినందుకు ఫీజుగా ఒక్క రూపాయి తీసుకోవడానికి రమ్మని ఆమె చెప్పారు. ఇది జరిగిన 10 నిముషాలకే ఆమెకు గుండెపోటు వచ్చిందని ఆయన అన్నారు. సుష్మా మృతికి సాల్వే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.