రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్లు చేతులు కలపనున్నట్టు తెలుస్తోంది. వీరి మధ్య చర్చలు జరగనున్నాయని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు ఉద్యోగులు చెప్పినట్టు వార్త సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఇద్దరు దిగ్గజ పారిశ్రామికవేత్తలు కలవడం ద్వారా ఇప్పటికే భారత్లో వ్యాపిస్తున్న వాల్మార్ట్ను ఎదుర్కొనే అవకాశం ఉంది. గతేడాది వాల్మార్ట్ ప్లిప్కార్టులో 16 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. రియలన్స్తో భాగస్వామ్యం కోసం అమెజాన్ ప్రతిపాదన తెచ్చిందని, అయితే ఇది ఇంకా చర్చల వరకూ వెళ్లలేదని ఉద్యోగి తెలిపారు. ఫిబ్రవరిలోపు రిలయన్స్ రీటైల్లో 26 శాతం వరకూ వాటా కొనుగోలు కోసం అమెజాన్ ప్రతిపాదించినట్టు మరో ఉన్నతోద్యోగి వెల్లడించారు. ఈ వార్తలపై అమెజాన్ గానీ, రిలయన్స్ గానీ స్పందించలేదు.