టీడీపీ నుంచి రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ నేత భూమా అఖిలప్రియ కుటుంబీకులు భూమా కిషోర్ రెడ్డి, మహేశ్ రెడ్డి బీజేపీ చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ నడ్డా సమక్షంలో కర్నూలులో జరిగిన కార్యక్రమంలో వీరు బీజేపీలో చేరారు. వీరికి కండువా కప్పిన జేడీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే టీడీపీ ని నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి, సుజనాచౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.