రాష్ట్రంలో రైతులకు రూ.24వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటే..మూడు విడతల్లో రూ.16వేల కోట్లు ఇచ్చామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణమాఫీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, రూ.8వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు.