గతంలో మోడీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కమిషన్ ఆదేశాలివ్వటం జీర్ణించుకోలేకనే ఆర్టీఐ చట్టాన్ని ప్రభుత్వం సవరిస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఆరోపించారు, డీమోనిటైజేషన్ , విద్యా అర్హతలు , బోగస్ రేషన్ కార్డుల సంఖ్య, విదేశాల నుండి తీసుకువచ్చిన నల్లధనం , ఎగవేతదారుల జాబితాను సమర్పించాలంటూ కేంద్ర సమాచార కమిషనర్ (సిఐసి) ఆదేశాల మేరకు ఆ వివరాలు వెల్లడయ్యాయని జైరామ్ రమేష్ గుర్తు చేసారు. ఇదే తరహాలో మున్ముందు కూడా ఆర్టీఐ బలో పేతం అయితే తమకు ఇబ్బందులు తప్పవరి భావించే ఆర్టీఐ సవరణ బిల్లు తీసుకువచ్చిందని మండిపడ్డారు. CIC ను స్వతంత్ర స్వయంప్రతిపత్త సంస్థ స్థాయి నుండి ప్రధాని కార్యాలయ ఆదేశాలు వెలువరించే సంస్ధగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నమిదని, ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ని త పరిధిలోకి తీసుకున్న విషయం గమనించాలని అన్నారు.
2003 లో గుజరాత్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధాని ప్రణాళికా సంఘం (ఇప్పుడు నీతి ఆయోగ్) వద్దకు వచ్చారు , ఈ సందర్భంలో రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య మరియు సామాజిక అభివృద్ధి స్థితిపై అసౌకర్య ప్రశ్నలను ఎదుర్కొన్నారు. దీంతో ఆయన 2014 లో భారత ప్రధాని అయిన వెంటనే తన ప్రతీకారం తీర్చుకుంటూ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు" అని ఆయన అన్నారు.