అమెరికాకు భారత్తో సత్సంబంధాలున్నాయని, అవి మరింత గణనీయంగా మెరుగుపడుతున్నాయని వైట్ హౌస్ పేర్కొంది. ప్రధాని మోడీతో, భారత ప్రభుత్వంతో తమకు మంచి, మరింతగా పెరుగుతున్న సంబంధాలున్నాయని వైట్ హౌస్ కౌన్సెలర్ కెల్యాన్నె కాన్వే చెప్పారు. కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించాలని మోడీ కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించిన విషయమై కెల్యాన్నేను విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆమె భారత్తో తమకు మంచి సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యానించారు.