ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర రావు ఆధ్వర్యంలో బీసీ నేతలు సోమవారం మధ్యాహ్నం బీసీ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్ ను కలిసి బీసీల సమస్యలు వివరించారు. స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం చర్చించారు. ప్రభుత్వ పథకాలు వివరించడంతోపాటు బీసీ సమస్యలపై చర్చించడానికి ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కరికాల వళవన్ వారికి చెప్పారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయమై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
ఆ తరువాత బీసీ నేతలు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, శంకర నారాయణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్, పలువురు ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ ను కూడా వారు మర్యాదపూర్వకంగా కలిశారు.