తెదేపా అధినేత చంద్రబాబును శుక్రవారం విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు చేసి అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా తన కాన్వాయ్తో నేరుగా విమానం దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్నా, ఉద్దేశ పూర్వకంగా కక్షసాధింపు చర్యలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు భద్రత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని చినరాజప్ప కోరారు. 2014కు ముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదన్నారు.