ఎమ్మెల్యేలను బంట్రోతు గా పేర్కొంటూ వైసిపి వర్గాల నుంచి వచ్చిన వ్యాఖ్యలు సరికాదని హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం ఆశించిన తీరులో లేదని, బడుగు బలహీన వర్గాలలో ఉన్న చేతి వృత్తుల వారికి ఏం చేస్తామో చెప్పలేదని, నీటి ప్రాజెక్టుల ప్రస్తావన అంతా జలయజ్ఞం తరహాలో ఉందని అన్నారు. బంట్రోతులంటూ సభలో వినిపించిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులు ప్రజలకు బంట్రోతులేనని అందరూ ప్రజలకు సేవ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.