వేసవి ఉక్క పోతల నుంచి కాసింత సేద తీరేందుకు చల్లటి గాలి వీస్తుందని చెట్టు కింద బల్లపై కూర్చున్నఓ యువకుడిపై హఠాత్తుగా పడిన పిడుగు పొట్టన పెట్టుకుంది. వివరాలలోకి వెలితే విజయవాడ సమీపంలో నివాసముంటున్న పాడ్ర నాగరాజు ఎలక్ట్రికల్ పనేలే చేసుకుని జీవించేవాడు. విజయవాడలో గత కొంత కాలంగా వీస్తున్న వడగాడ్పుల నుంచి ఊరట లభించేలా ఉరుములతో కూడిన జల్లులు నడటంతో చట్లగాలి కోసం తన ఇంటి సమీపంలో చెట్ట క్రింద సేత తీరేందుకు కూర్చున్నాడు. అయితే హఠాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో పాటు పక్కనుంచి వెళ్లున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు చెట్టుని నాశనం చేయటంతో పాటు నాగరాజు ప్రాణాలు తీసాయి. అంత వరకు తమ కళ్ల ముందు తిరుగాడిన వ్యక్తి హఠాత్తుగా మరణించడంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.