ప్రేమ విఫలమైన ప్రేమజంట మద్యం సేవించి, సెల్ఫీలు దిగి నాటుతుపాకితో కాల్చుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నారు . రాజస్ధాన్లోని బార్మర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా సహజీవనం సాగిస్తున్నా అంజు సుతార్, శంకార్ చౌదురిలని విడదీసిన పెద్దలు ఇటీవలే అంజూ సుతార్కు మరొకరితో వివాహం చేసారు. దీంతో తాము ఇక కలిసి ఉండలేమని భావించి వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడాలని భావించారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడే ముందు మద్యం సేవించి, తమ ప్రేమ విఫలమైనందునే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని తమ మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేయటంతో పాటు సెల్ఫీలు దిగారు. ఈ విషయం బంధువు ఒకరికి పంపడంతో పాటు సామాజిక మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ఆరంభించారు. ఘటనా స్థలంలో రెండు తుపాకీలతో పాటు మద్యం సీసాలు, సిగరెట్లు మృతదేహాల వద్ద లభ్యమయ్యాయని చెప్పారు.