ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను నూతన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. మొదటి సంవత్సరం పరీక్షకు 4,76,710 మంది హాజరుకాగా మార్చి పరీక్షలో 2,86,932 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా సప్లమెంటరీలో కొత్తగా 53,025 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రెండవ సంవత్సరంలో 4,31,719 మంది హాజరుకాగా మార్చి పరీక్షలో 3,09,721 మంది హాజరవగా కొత్తగా 66,114 మంది ఉత్తీర్ణత సాధించారు.