టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పట్టుదలతో పోరాడాలని, హక్కుల సాధనే టీడీపీ లక్ష్యమని, ప్రజల సంక్షేమమే మన ధ్యేయం కావాలన్నారు. గత 37 ఏళ్ళుగా ఎన్నో ఆటుపోట్లను చూశామని, పార్టీ, ప్రజలపట్ల బాధ్యతను తుచ తప్పకుండా పాటించాలన్నారు. కార్యకర్తలు, నాయకులలో మనో ధైర్యం పెంచాలని, సమస్యల పరిష్కారంపై టీడీపీ పోరాటపటిమ ప్రజలలోకి వెళ్లాలన్నారు. రెండు వారాలుగా పలుజిల్లాలలో కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేలు ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలన్నారు. జిల్లా రాష్ట్రస్థాయిలలో పార్టీ తరపుల కార్యాచరణ రూపొందించాలన్నారు.