పాట్నా : బీహార్లోని బారురాజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.