అక్రమ జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ధర్నాను విరమించారు. ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతపై సీఎం జగన్ స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి ద్వారా సంఘటనకు సంబంధించిన విషయాలపై సీఎం ఆరా తీశారు. నెల్లూరు జిల్లా చింతలదీవిలోని కామధేనువు బ్రీడింగ్ పసుక్షేత్రానికి అక్రమంగా నీరందించేందుకు నిర్మిస్తున్న పైపులైన్లను తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన విషయం తెలిసిందే.