విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ నియమితులయ్యే అవకాశాలున్నట్టు విశ్వసీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే సుష్మ నియామకం నిర్ధారిస్తూ ఆమెకు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ట్వీట్టర్ లో అభినందనలు తెలియచేసి, ఆ తరువాత తొలగించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్గా కొనసాగుతున్న ఈఎస్ఎల్. నరసింహన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నియమించుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో... గత ఎన్నికల్లో పోటీ చేయని సుష్మాను ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఇక్కడ కొత్త గవర్నర్ను నియమించాలని కేంద్రం భావించినట్టు సమాచారం.