గత కొంత కాలంగా పశ్చిమబెంగాల్లో బిజెపి- తృణమూల్లు ఉప్పు నిప్పులుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల ఫలితాలు తరువాత పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు, హింస చెలరేగి ఎన్నికల తర్వాత కూడా ఇవి కొనసాగుతుండటంతో పాటు ఘర్షణల్లో నలుగురు చనిపోవటంపై కేంద్రం సీరియస్గా ఉంది. ఇన్నటికే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేత కైలాశ్ విజయ్వార్గియా డిమాండ్ నేపథ్యంలో బెంగాల్లో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి కేంద్రానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ తో మాట్లాడిన త్రిపాఠి.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం రావొచ్చునని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి ప్రధానితోగానీ, హోంమంత్రితోగానీ నేను చర్చించలేదు’ అని పేర్కొన్నారు.