ప్రకాశం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతమని, రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ‘లో గ్రేడ్’ పొగాకు ఉత్పత్తి అయిందన్నారు. రైతులకు మంచి ధర వచ్చేవిధంగా కృషిచేస్తానన్నారు.