టిటిడికి అనుబంధంగా ఉన్న బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్లో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 19వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 3 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు అస్థానం చేపట్టారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా నిర్వహించారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక అంగవస్త్రం, రవికె, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.