ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరాలయంలో వార్షిక వసంతోత్సవాలు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2019, 11:14 PM
టిటిడికి అనుబంధంగా ఉన్న బెంగళూరు నగరంలోని వయ్యాలికావల్‌లో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 19వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 3 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల  ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు అస్థానం చేపట్టారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక అంగవస్త్రం, రవికె, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com