కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే ..బీజేపీ , వైకాపా పార్టీలు తందానా.. అని వంతపాడటం శోచనీయమని అన్నారు . ఏపీపీసీసీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి బుధవారం కడపజిల్లా వేంపల్లె లో ఆయన మీడియాలో మాట్లాడుతూ.. దేశంలోని ఇరవై మూడు రాజకీయ పార్టీలు బ్యాలెట్ పేపర్లు ద్వారా భవిష్యత్తులో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తుంటే ఈసి స్పందించకుండా కొత్త కట్టుకతలు చెపుతోందని మండి పడ్డారు ఈ ఎన్నికలకు సంబంధించి వీవీప్యాట్ రశీదులను కనీసంగా లెక్కించాలని కోరుతుండగా, సుప్రీం కోర్టుకూడా ఇదే విషయంపై స్పష్టమైన ఆదేశాలిచ్చినా. కేంద్ర ఎన్నికల సంఘం మొండిగా, నిరంకుశంగా తిరస్కరించడం దురదృష్టకరమన్నారు. ప్రపంచంలో 191 దేశాలుండగా అందులో 173 దేశాల్లో బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలునిర్వహిస్తున్నాయని, అందులో అమెరికా, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉన్నాయని, అంటే వారికి సాంకేతిక పరిజ్ఞానం లేదని ఈసీ అధికారులు చెపుతున్నట్టుందని అన్నారు. ఇప్పటికీ. కొన్ని దేశాలు కొన్నాళ్లు ఈవీఎంలు వాడి లోపాలు ఉన్నాయని గ్రహించి తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయని, ఈవిఎంలలో పొరపాట్లు సరిదిద్దేందుకు వీవీప్యాట్ రశీదులు పెట్టారని, కానీ వాటిని లెక్కించనప్పుడు ఎందుకు ప్రవేశపెట్టినట్లు అని ఆయన ప్రశ్నించారు..