ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఓటర్లకి షాకిచ్చిన కావేరీ ట్రావెల్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2019, 08:47 AM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్దమైన ఓటర్లకు కావేరీ ట్రావెల్స్ షాకిచ్చింది. బుధవారం(ఏప్రిల్ 10) ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 125 బస్సులు ఉన్నఫలంగా రద్దు చేసేసింది. ఇందులో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా డబ్బులు తిరిగిచ్చేస్తామని ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీంతో సుమారు 5వేల మంది ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లడం ప్రశ్నార్థకంగా మారింది. 


ఎన్నికల సమయంలో ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులు అర్థంతరంగా రద్దు చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కావేరీ ట్రావెల్స్ 125 బస్సులు రద్దు చేయడం అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు ఇప్పటికీ సొంతూళ్లలో ఓట్లున్నాయి. దీంతో గురువారం(ఏప్రిల్ 11) ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు లక్షలాది మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లు, విమానాల్లో టిక్కెట్లు రిజ్వర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారమే చాలామంది స్వస్థలాలకు బయలుదేరగా, ఎక్కువ మంది బుధవారం టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అయితే బుధవారం నడిపే 125 సర్వీసులను అర్థంతరంగా రద్దు చేస్తున్నట్లు కావేరీ ట్రావెల్స్ ప్రకటించింది. 


అనివార్య కారణాల వల్లే సర్వీసులు రద్దు చేశాయని, ప్రయాణికుల డబ్బులు వాపసు చేస్తామని కావేరీ యాజమాన్యం ప్రయాణికులకు ఎమ్మెస్ చేసింది. బస్సులకు సరిపడా డ్రైవర్లు లేని కారణంగానే సర్వీసులు నిలిపివేసినట్లు కావేరీ యాజమాన్యం చెబుతున్నా.. భాగస్వాముల మధ్య వివాదాల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com