అవినీతి ముద్దు బిడ్డ అయిన జగన్ ఏపీకి నిష్ట దరిద్రంగా మారారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని విరుచుకుపడ్డారు. అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జగన్ కు సహకరించిన అధికారులంతా జైలు పాలయ్యారని యామిని విమర్శించారు. ‘అవసరమైతే మీ బిడ్డను ఇంట్లో ఉంచుకోండి… కానీ తల్లి ప్రేమ, వాత్సల్యాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలోని భవిష్యత్ తరాల జీవితాలను పణంగా పెట్టొద్దని వైఎస్ విజయమ్మను కోరుతున్నానని చెప్పారు. తమ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని ఏపీలోని తల్లులను యామిని కోరారు. అసలు అధికారంలోకి రాకుండానే జగన్ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆమె విమర్శించారు. వాన్ పిక్, లేపాక్షి రూపంలో వేలాది ఎకరాలు చేశారన్నారు. అమ్మాయిలపైనా అరాచకాలు చేశారన్నారు. ఇలాంటి అరాచక వ్యక్తుల ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమైపోతామేమోనని ఏపీ ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అరాచకవాదిగా మారడానికి విజయమ్మ పెంపకమే కారణమని ఆరోపించారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డితో బలవంతంగా జగన్ రాజీనామా చేయించబోతే, వైఎస్ సోనియాకు ఈ విషయం చెప్పడాన్ని మర్చిపోయారా? అని విజయమ్మను ప్రశ్నించారు. అమెరికాలో చదువుకోవడానికి పంపిస్తే అది కూడా పూర్తిచేయకుండా వచ్చిన జగన్ ను మందలించి ఉంటే ఓ తల్లిగా, వైఎస్ భార్యగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఉండేవాళ్లమని సాధినేని యామిని అన్నారు.