పంజాబ్: ఖరార్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళా డ్రగ్ ఇన్స్పెక్టర్ను హత్య చేశారు. నేహాషోరీ రోపార్ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె 2009లో మోరిండాలోని మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించింది. బల్వీందర్ సింగ్ దుకాణంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి దుకాణాం లైసెన్స్ రద్దుచేశారు. దీంతో కక్షపెంచుకున్న బల్వీందర్ సింగ్ శుక్రవారంనాడు కార్యాలయానికి వచ్చిన ఆమెపై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే చనిపోగా, తరువాత బల్వీందర్ తనకు తాను కాల్పులు జరుపుకున్నాడు. తీవ్రంగా గాయపడిన బల్వీందర్ను ఆసుపత్రికి తరలించి చికిత్సచేయిస్తున్నారు.