మండ్య, మైసూరు, హసన్, బెంగళూరులోని మొత్తం 12 ప్రాంతాల్లో ఏక కాలంలో ఐటి అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పుట్టరాజుతో పాటు ఓ ఎంఎల్సి ఇంట్లో దాడులు కొనసాగుతున్నాయి. సిఎం కుమార స్వామి సోదరుడు రేవణ్ణ ప్రధాన అనుచరుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల కార్యాలయాలలోను, వారి ఇళ్లలోనూ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్-జెడిఎస్ మంత్రులు, ఎంఎల్ఎ లపై ఐటి సోదాలు జరిగే అవకాశముందని ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చెప్పినట్టే దాడులు జరగడం గమనార్హం.