విజయవాడ: ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆయనకు స్వాగతం పలికారు. మరికాసేపట్లో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబుతో కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై నేతలిద్దరూ చర్చించనున్నారు.