దియాల ప్రావీన్స్ లో 25 సంవత్సరాల మహిళ తొలి కాన్పులోనే ఏడుగురు శిశువులకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. జన్మించిన వారిలో ఆరుగురు ఆడపిల్లలు కాగా, ఒకరు అబ్బాయి. ఇరాక్ దేశంలో ఒక మహిళ ఒకే కాన్పులో ఏడుగురికి జననం ఇవ్వడం తొలిసారి అంటున్నారు. దియాల ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనపై అక్కడి ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి ఫిరాజ్ మాట్లాడుతూ గర్భిణీ వయస్సు 25 కాగా, సహజ కాన్పులోనే జరిగిందని చెప్పారు. ఆమె భర్త యూసఫ్ ఫదుల్ మాట్లాడుతూ ఏడుగురు సరిపోతారని, భవిష్యత్తులో ఇక పిల్లలు కనే యోచన విరమించుకుంటామని అన్నారు. 1997లో లోవా లో కెన్నీ, బాబీ మెక్ దంపతులకు ఏడుగురు సంతానం కలిగారు. 2018లో లెబనాన్లోని సెయింట్ జార్జ్ యూనివర్సిటీ ఆస్పత్రిలోనూ ఓ కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించారు. అయితే 200మిలియన్ కేసుల్లో ఒకటి ఇలా జరిగే అవకాశముందని డాక్టర్లు చెప్పారని సియాన్ పేర్కొన్నారు