సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాక్లో పర్యటించే కొన్ని గంటల ముందు బలూచిస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది పాక్ సైనికులు మృతిచెందారు. ఇందుకు సంబంధించి పైక్ సైనిక వర్గాలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బలూచిస్థాన్లో సైనిక కాన్వాయ్ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగిందని ఈ సంఘటనలో 9మంది సైనికులు అక్కడిక్కడే చనిపోగా మరో 11 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్ధ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు కారణమని నిఘావర్గాలు, సైనిక అధికారులు అనుమానిస్తున్నట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.