ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 04:24 PM

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న జనసేన పార్టీ ఎపి కార్యాలయంలో 2019 సార్వత్రిక ఎన్నికల ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్‌ ప్రక్రియను శుక్రవారం కొనసాగించారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి అభ్యర్థుల బయోడేటాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థుల స్క్రీనింగ్‌ ప్రక్రియ ఈ రోజు రాత్రి వరకు కొనసాగే అవకాశముంది. స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హం ఖాన్‌, పి.హరిప్రసాద్‌, మహేందర్‌ రెడ్డిలు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com