విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న జనసేన పార్టీ ఎపి కార్యాలయంలో 2019 సార్వత్రిక ఎన్నికల ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ ప్రక్రియను శుక్రవారం కొనసాగించారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి అభ్యర్థుల బయోడేటాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఆశావహులు జనసేన పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ ఈ రోజు రాత్రి వరకు కొనసాగే అవకాశముంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, పి.హరిప్రసాద్, మహేందర్ రెడ్డిలు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.