శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన ఘటనను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. అమరవీరుల కుటంబాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కాగా, ఈ దాడిని , జమ్ము అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, పీడీఎఫ్ నేత మెహబూబా ముఫ్తీ ఖండించారు.